Sunday, August 30, 2009

ట్రోజన్ ?

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో వారు ఆంతరంగికంగా మాట్లాడుకున్న విషయాలన్నీ తెలుగుదేశం వారికి చేరిపోతున్నాయని పెద్ద గందరగోళమే జరిగింది.ఇప్పుడు వీలయినంత తొందరగా సొంత గూటికి యెగిరిపోతున్న పక్షుల్నీ వాటికి లభిస్తున్న స్వాగతాల్నీ వీరతాళ్ళనీ చూస్తుంటే మిషన్ ఎకాంప్లిష్డ్ అనిపిస్తోంది. స్వగృహ ప్రవేశాన్ని నిరసించిన ఒకరిద్దరికి కూడా నిజాన్ని లోపాయకారీగా చెప్పి నోరు మూయించారేమో!పాపం చిరంజీవి. ఇప్పటికైనా ఎన్ టీ ఆర్ యేం చేశారో చూసి తన విసనకర్రలకి ప్రాధాన్యం ఇవ్వడం మొదలెడితే బాగుంటుంది. మరో సంగతి జనాన్ని చూసుకుని తనూ ఎన్ టీ ఆర్ అంత వాడిననే భ్రమనించి బయటకి రావాలి. పుటం పెట్టినా సీతారామకళ్యాణం వంటి దాన్ని ఊహించి సృష్టించే స్తోమతు తనకి లేదు కదా!జ్ఞానపీఠ్ వచ్చినవారంతా త్యాగరాజులు కన్నా గొప్ప కాదుకద!

No comments:

Post a Comment