Tuesday, July 14, 2009

దేశం యేమయ్యెట్టు

రాజశేఖరరెడ్డిగారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నెట్ లో కాంపైన్ మొదలైందట! అలనాటి క్లాసిక్ కథానాయకుడు సినిమా లోని నాగభూషణం డైలాగు గుర్తొచ్చింది. అల్లు రామలింగయ్య ధరించిన అప్పడు అనే మునిసిపల్ కౌన్సిలర్ తన శిలా విగ్రహం పెట్టించమని అడిగిన సందర్భంలో దేశం యేమయ్యెట్టు అని తన టిపికల్ స్వరంలో అంటాడు. ఇప్పుడు ప్రపంచం యేమయ్యేట్టు అనాలా!.అన్నీ పురాణాల్లోనే వున్నాయి అన్నట్టు అన్నీ కన్యాశుల్కంలోనే వున్నాయి. అసెంబ్లీ లో బాబు గారు నిప్పులు చెరుగుతున్నప్పుడు రెడ్డి గారి నవ్వు చూస్తే అగ్నిహొత్రావధాన్లు ఉక్రోషంతో ప్లీడర్ని నీ ఇంట కోడి కాల్చా అని శాపనార్ధం పెడితే నెమ్మదిగా 'రోజూ కాలుస్తూనే వుంటారూ అని ఆ నాయుడు అనబడే ప్లీడరు సమాధానం ఇవ్వడం గుర్తొస్తుంది..

No comments:

Post a Comment