నన్నపనేని రాజకుమారి గారు మాట తూలి రాళ్ళ వర్షానికి గురయ్యారు. అవతల వాళ్ళు కూడా హద్దుమీరడం తప్పితే ఇదొక వార్తా? మొన్నటికి మొన్న రాజధానిలో రాజకీయాలకి సంబంధంలేని బ్రహ్మానందం సన్మానసభలో నోరుజారి బ్రహ్మానందం చేత చెంపపెట్టులాంటి మాట అనిపించుకున్నారు. నోరా వీపుకి తేకే అన్న నానుడి ఎప్పటికి అర్ధం చేసుకుంటారో. బాధాకరమైన విషయం యేమంటే ఆవిడ అధినేత కూడా ఈ మార్గమే ఉత్తమమని తనూ అనుసరించే సూచనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి.ఆయన చతురతతో జ్ఞానంతో దూరదృష్టితో ఆంధ్ర దేశానికి చేయవలసిన మేలింకా చాలా మిగిలి వుంది.ఆయన నాయకత్వం కోసం జాతి యెదురు చూస్తోంది. పెద్దమనిషి తరహా వదిలేసి ఇలా పక్కదారి పట్టడం శోచనీయం.బాబు గారూ మామీద దయ తలచండి.
No comments:
Post a Comment