Saturday, October 31, 2009

తాగిన వాడి నోట

తాగిన వాడి నోట నిజాలే వస్తాయంటారు.కే సి ఆర్ గారు మాత్రం తాగడం మానేశాక చాలా నిజాలు చెప్తున్నారు. లుచ్ఛాలు లఫంగులు ఇత్యాదులు. నిజానికి నేటి రాజకీయ నాయకులున్న ఏ ఫొటోని చూసినా రోగ్స్ గాలరీ లాగే వుంటుంది. కేసీఆర్ కూడా అందులోనివాడే అన్నది మనకీ తెలుసనుకోండి. అయితే బాధాకరమైనదేమిటంటే ఇదే తెలంగాణా ప్రజల భాష అని ఆయన దబాయిస్తున్నారు. నాకు తెలంగాణా మిత్రులెంతమందో వున్నారు. లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణా మహామహులెందరో వున్నారు. కీర్తిశేషుల దాశరధి కృష్ణమాచార్యులు గారూ, ఇంకా మనతోవున్న సి నా రె , నేటితరం అశోక్ తేజ, చుక్కా రామయ్య గారు, దెవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, యెవరైనా యెప్పుడైనా పదిమందిలో ఇలా మాట్లాడడం యెక్కడా వినలేదు.మరి వీరిలో ఎవరూ ఆయన్ని ఖండించకపోవడం శోచనీయం. ముంబైలో రాజ్ థాకరే లాగ ఈయనకీ భయపడుతున్నారా? బురదలో కాలెందుకు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? తెలుగుతల్లి పాటని అవమాన పరుస్తుంటే తెలంగాణా మేధావులు యేంచేస్తున్నారు? పురుగుల్ని నలిపెయ్యాలని ఎప్పటికి గుర్తిస్తారు?

1 comment:

  1. బాగా అడిగారు.అక్షరాల పరిమాణం కాస్త పెంచండి.అలాగే ఆ చేత్తోనే word verification కూడా తీసివేస్తే బాగుంటుంది.

    ReplyDelete